- Advertisement -
నవతెలంగాణ – చారకొండ
చారకొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ముసాయిదా తుది ఓటరు జాబితాను ఎంపీడీవో శంకర్ నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఎంపిటిసి జడ్పిటిసి ఓటర్ జాబితా మరియు పోలింగ్ స్టేషన్ ముసాయిదా జాబితా ఎంపీడీవో కార్యాలయంలో ప్రచూరింపబడుతుంది. ఓటర్లకు ఏలాంటి అభ్యంతరాలున్నా ఈనెల 8 వరకు లిఖితపూర్వకంగా రాసి ఎంపీడీవో కార్యాలయంలో ఇవ్వగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జి గణేష్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -