- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలంమందనపల్లి ప్రాథమిక పాఠశాల లో సోమవారం నాడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించడం జరిగింది. పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి, చిత్రలేఖనం పట్ల విద్యార్థులకు అభిరుచిని పెంపొందించడానికి ఈ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. సయ్యద్, ఉపాధ్యాయురాలు ఎం.అఖిల, భవిత, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. తదనంతరం పోటీలలో గెలుపొందిన అభినందించి వారికి బహుమతి ప్రధానం చేయడం జరిగింది.
- Advertisement -