- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యా యులు తిరుపతయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా డ్రాయింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు అందరికీ డ్రాయింగ్ పోటీలు నిర్వహించడమే కాకుండా విజేతలకు ప్రథమ, ద్వితీయ ,తృతీయ బహుమతులు రిపబ్లిక్ డే వేడుకలు నాడు అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తో పాటు ఉపాధ్యాయులు యాదవ్ హీరా మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



