Wednesday, June 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్తుపదార్థాల నివారణ..మన చేతుల్లోనే

మత్తుపదార్థాల నివారణ..మన చేతుల్లోనే

- Advertisement -

-బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించిన పోలీసులు
-మత్తు పదార్థాల అనర్దాలపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ
నవతెలంగాణ – బెజ్జంకి
: మత్తుపదార్థాల నివారణ..మన చేతుల్లోనే ఉందని..అందరూ కృషి చేస్తామని పోలీసులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.మంగళవారం మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తా,తహసీల్,ఆరోగ్య కేంద్రం,జూనియర్ కళాశాల మీదుగా బస్టాండ్ వరకు మత్తుపదార్థాల వినియోగం వల్ల సంభవించే అనర్దాలపై కేజీబీవీ,బాలుర,బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలల విద్యార్థులతో పోలీసులు ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపతి రెడ్డి మాట్లాడారు.మత్తుపదార్థాల వినియోగం వల్ల యువత జీవితం పెడదారిపడుతోందన్నారు. మత్తుపదార్థాల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.ఏఎస్ఐ శంకర్ రావు,పోలీసులు సౌజన్య,నాంపల్లి శ్రీను,రవి,సాయికృష్ణ,పృథ్వీ,సునీల్, అయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -