Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయి..

మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయి..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
మాదక ద్రవ్యాల దుష్పరిణామాలతో కుటుంబాలు కోలుకోలేదు కుండా పోతాయని,మత్తు పదార్థాలు జీవనాన్ని నాశనం చేస్తాయని,  మాదకద్రవ్యాల వినియోగం నేరమని, చట్టపరమైన శిక్షకు ఉంటుందని యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి పేర్కొన్నారు.మంగళవారం ఇందల్ వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని తిర్మన్ పల్లి గ్రామ పంచాయతీ లో అవగాహన కార్యక్రమన్ని  నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సిఐ వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా  ప్రజలకు  వివిధ సామాజిక అంశాలపై విలువైన సందేశాలను వివరించారు.రోడ్డు భద్రతపై అవగాహన: హెల్మెట్ ధరించండి – హెల్మెట్ బరువు కాదు, ఇది బాధ్యత అని,జీవించు, జీవించనివ్వు – రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా పాటించాలని, ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్లి లేని ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దని సూచించారు.

మహిళల రక్షణ కోసం చట్టాలు ఉన్నాయని,మహిళలు ఏవైనా అసౌకర్యానికి గురైనపుడు షీ టీం నంబర్ 8712659795 లేదా డాయల్ 100 కు కాల్ చేయాలన్నారు.మొబైల్ పోగొట్టినపుడు.మొబైల్ దొంగిలింపు/పోయిన సందర్భంలో CEIR. సిఈఐఅర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయించుకోవచ్చని, పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ సేవల కోసం డాయల్ 100 ఉపయోగించాలని,ఆన్లైన్ మోసాలు,  సైబర్ మోసాల నుండి రక్షణ కోసం అప్రమత్తంగా ఉండాలని – ఏదైనా మోసానికి గురైతే టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫోన్ చేయాలని సూచించారు. సామాజిక సమతా సందేశం:అందరూ అన్నదమ్ముల్లా శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలని, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన కల్పించబడిందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి ఎస్ హెచ్ ఓ జి సందీప్, మాజీ ఎంపిటిసి చింతల దాస్, కార్యదర్శి తిరునగరి శ్రీధర్, గ్రామ అభివృద్ది కమిటీ చైర్మన్ దర్పల్లి ప్రభాకర్, కరోబర్ పిల్లి నరేందర్,యువకులు గ్రామస్తులు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -