Monday, June 9, 2025
E-PAPER
Homeజాతీయంమోడీ హయాంలో

మోడీ హయాంలో

- Advertisement -

– రాజ్యాంగ సంస్థల హైజాక్‌
– ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌
పాట్నా :
ప్రధాని మోడీ ప్రభుత్వంలో రాజ్యాంగ సంస్థలు హైజాక్‌ అయ్యాయని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం ఎన్నికల సంఘం (ఈసీ) వంటి రాజ్యాంగ సంస్థలను హైజాక్‌ చేస్తోందని, ఎన్నికల తేదీలు ప్రకటించకముందే అధికార బీజేపీ ఎన్నికల షెడ్యూల్‌ గురించి ఎలా తెలుసుకుంటుందని అన్నారు. ”2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని రాజ్యాంగ సంస్థలూ హైజాక్‌కు గురయ్యాయి. ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడడానికి ముందే బీజేపీ ఐటీ సెల్‌ తెలుసుకుంటోంది. ఇలా చాలా పరిణామాలను గమనించాం” అని అన్నారు. రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పనిచేయాల్సిన అవసరమున్నదని, వాటిపై ప్రభావం పడితే ప్రజలు ఎలా న్యాయం ఆశించగలరని ప్రశ్నించారు. 2020లో బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, న్యాయంగా జరగలేదని విమర్శించారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వుందని అన్నారు. సాయంత్రానికి ఓట్ల లెక్కింపు ఆగిపోయిందని, సమర్థించుకునేందుకు ఈసీ మూడు మీడియా సమావేశాలను నిర్వహించిందని చెప్పారు. రాత్రిపూట తిరిగి లెక్కింపు ఎందుకు ప్రారంభించారని, విజేతలుగా ప్రకటించబడిన మహాఘట్‌బంధన్‌ అభ్యర్థులు తర్వాత ఓడిపోయినట్టుగా వెల్లడించారని, వీటికి ఈసీ సమాధానమివ్వాల్సి ఉన్నదని తేజస్వీయాదవ్‌ పునరుద్ఘాటించారు. మహారాష్ట్ర ఎన్నికలపై ఇండియా బ్లాక్‌ నేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు మద్దతు ప్రకటిస్తున్నానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -