నవతెలంగాణ- ఆలేరు టౌను
ద్వారకా నగర్ ను అని రంగాల అభివృద్ధి పరుస్తానని, ఆలేరు పురపాలక సంఘం చైర్మన్, బీజని బాలమణి భాస్కర్ అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం చైర్మన్ దంపతులను ద్వారకా నగర్ బజరంగ్ యూత్ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించారు. మెమెంటు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్వారకా నగర్ లో పలు సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాస్, కాంగ్రెస్ పార్టీ మత్స్యశాఖ విభాగం అధ్యక్షులు బరిగె శ్రీనివాస్, బజరంగ్ యూత్ అధ్యక్షులు సీసా శివ, బరిగే వెంకటేష్, కిరణ్, సందీప్, శివ, క్రాంతి, వంశీ, భాను, వివేక్, ప్రదీప్, ఆంజనేయులు, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.



