నవతెలంగాణ – కంఠేశ్వర్
పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లకు ఈ – సమాన్స్ శిక్షణ కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్ట్ డ్యూటీ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ..ఈ – సమాన్స్ నిర్వహణపై పోలీస్ సిబ్బందికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ప్రతి కేసులో సంబంధిత వ్యక్తులకు సమయానుగుణంగా ఈ – సమా న్స్ జారీ చేయాలి. పారదర్శకత, మరియు వేగవంతమైన సేవలకై టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించాలన్నారు. సంబంధిత డిజిటల్ ప్లాట్ ఫామ్లను వాడడంలో శిక్షణ తీసుకుని , ప్రతి ఆదేశాన్ని రికార్డు చేయాలని సూచించారు.
సంబంధిత అన్ని కోర్టుల నుండి సమన్సు జారీ చేసిన వాటిని అట్టి సమాన్స్ లను పోలీస్ స్టేషన్లో వారు డౌన్లోడ్ చేసుకుని ఆ సమాన్స్ ను వాటిని త్వరితగతిన సర్వ్ చేయాలి అని తెలియజేయడం జరిగింది. ఈ శిక్షణను సిబ్బంది సద్వినియోగపరుచుకొని శిక్షణ పూర్తి అయిన అనంతరము సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ లకు ఈ శిక్షణ గురించి క్లుప్తంగా తెలియజేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఆదనపు డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి , సి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ సతీష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్యాం కుమార్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కోర్ డ్యూటీ ఆఫీసర్లు, ఐటి కోర్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోర్టు డ్యూటీ ఆఫీసర్లకు ఈ- సమన్స్ శిక్షణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES