Saturday, May 31, 2025
E-PAPER
Homeజాతీయంభువనేశ్వర్‌లో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ అరెస్ట్

భువనేశ్వర్‌లో ఈడీ డిప్యూటీ డైరెక్టర్ రఘువంశీ అరెస్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: స‌మాజంలో అవినీతిని క‌ట్ట‌డి చేయాల్సిన అధికారులే లంచాల‌కు రుచిమ‌రిగారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అధికారులు గురువారం రూ.20 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 2013 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) అధికారి అయిన రఘువంశీ, ఓ మైనింగ్ కేసును పరిష్కరించేందుకు ఏకంగా రూ.50 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఒక మైన్ ఆపరేటర్, రఘువంశీ డిమాండ్‌ చేసిన లంచం అడిగిన విషయాన్ని సీబీఐకి సమాచారం అందించగా.. పక్కా ప్లాన్ వేసి చింతన్ రఘువంశీని అదపులోకి తీసున్నారు. ఒకటిన్నర సంవత్సరాలుగా భువనేశ్వర్ జోనల్ ఆఫీస్‌లో ఈడీ డిప్యూటీ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రఘువంశీని ఇవాళ ఉదయం అధికారులు అరెస్ట్ చేసి భువనేశ్వర్‌లోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. పూర్తి ఎంక్వైరీ తర్వాత మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి రానున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -