నవతెలంగాణ – ఉప్పునుంతల : ఉప్పునుంతల మండలంలోనీ పెనిమిళ్ళ జడ్పీహెచ్ఎస్ పాఠశాల స్థితిగతులపై తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ మెంబర్ చారగొండ వెంకటేష్ గురువారం స్కూల్ ను సందర్శించారు. ఈనెల 13న మా గ్రామ ప్రభుత్వ పాఠశాల స్థితిగతులపై పర్యవేక్షించాలని గ్రామస్తుల వినతి మేరకు గురువారం పెనీమీల్ల గ్రామాన్ని ఆయన సందర్శించి ప్రభుత్వ పాఠశాల స్థితిగతులపై ఆయన అధ్యయనం చేసినట్లు తెలిపారు. శిధిలావస్థకు చేరి వర్షాలు పడ్డప్పుడు తడిసిన పాఠశాల తరగతి గదులను, మధ్యాహనం భోజనం కోసం దాచే సరుకులకు కూడా నోచుకొని వంట గది,వినియోగంలో లేని మూత్రశాలలు,అక్కరకు రాని విధంగా ఉన్న అంగన్వాడీ సెంటర్ ను చూసి ఆయన చలించిపోఅయినట్లు తెలిపారు. మండలంలో పెద్ద జనాభా కలిగిన గ్రామం విద్యా విషయంలో పెద్ద సమస్యలో ఉందని ఆయన అన్నారు. విద్య అనేది ప్రతి పౌరునికి ప్రాథమిక హక్కు విద్యా విధానం మెరుగుపడ్డప్పుడే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన గుర్తు చేశారు. పాఠశాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. చిన్నప్పుడు అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్చిన అదే గ్రామానికి చెందిన వ్యాపారవేత్త అయిన మారం సురేష్ రెడ్డి గతంలో తన తండ్రి జ్ఞాపకార్ధంగా రెండు తరగతి గదులు నిర్మించిన దాతగా గుర్తించిన ఆయనకు వెంటనే ఫోన్ చేసి త్వరలో నిర్మించబోయే నూతన పాఠశాల భవనానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మళ్ళీ తమ వంతుగా బాధ్యత వహించాలని చారగొండ వెంకటేష్ కోరడంతో ఆయన వెంటనే ఒప్పుకున్నట్లు తెలిపారు.ప్రభుత్వం కృషికి దాతల తోడ్పాటు కూడా ఎంతో అవసరమన్నారు.అప్పుడే అనుకున్న లక్ష్యన్నీ అనుకున్న సమయానికి చేరుకుంటామన్నారు.మొన్నటి అకాడమిక్ సంవత్సరంలో 500 మార్కులకు పైగా ఉత్తీర్ణత సాధించిన ఉత్తమ విద్యార్థులకు చెందిన విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చి అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు.వీలైనంత త్వరగా నూతన ఓరవడితో ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చి విద్యార్థులను బావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు వేడుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు,గ్రామ పెద్దలు ప్రతాపరెడ్డి, బొడ్డుపల్లి అంజి,పంజుగుళ్ళ మల్లయ్య గౌడ్ ,శ్రీనివాస్ గౌడ్, విజయ్, శ్రీను, శేఖర్ ,బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
పెనిమిళ్ళ స్కూల్ ను విజిట్ చేసిన విద్యాశాఖ కమిషన్ మెంబర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES