నవతెలంగాణ – కామారెడ్డి: తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఏర్పాటు చేసిన ప్రభుత్వ బడులలో పిల్లలను, చేర్పించండి, సంస్కారంతో పాటు నాణ్యమైన విద్యను పొందండి అంటూ బడిబాట పోస్టర్ ను తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం ( టీ పి యు ఎస్) కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఏర్పాటు చేసి జిల్లా విద్యా శాఖ అధికారి రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా లోని బడి ఈడు గల పిల్లలందరినీ ప్రభుత్వ బడులలో చేర్చి మీ పిల్లలకు నాణ్యమైన విద్య తో పాటు సంస్కారం, వారిలో నైతిక విలువలు పెంపొందించాలని విద్యార్థుల తల్లి, తండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తున్న తపస్ జిల్లా శాఖను అభినందించారు . ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పుల్గం రాఘవరెడ్డి, రాష్ట్ర బాధ్యులు రామచంద్రం, జిల్లా బాధ్యులు లక్మీపతి, ఆంజనేయులు ,రాజశేఖర్, సత్య నారాయణ. పవన్ కుమార్,దత్తాచారి. సంతోష్ తదితరులు హాజరయ్యారు.
బడిబాట పోస్టర్ ఆవిష్కరించిన విద్యాశాఖ అధికారి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES