- Advertisement -
విద్య అన్ని స్థాయిల్లో
అయ్యేను నేడు మీద్య
నాటి నేటి పాలకుల విస్మరణ
వ్యాపారుల లాభాపేక్ష
ఈ తరం విద్యార్థులకు
మారెను ఓ భారంగా
నైపుణ్యాల లేమి
ఉపాధికి లేని హామీ
రుణ భారం తోని
జీవించుట నేర్పని విద్య
అందుకే రావాలి మార్పు
విద్యా బోధనలో
విద్యా విధానంలో
సరైన మూల్యంలో
విద్యార్జనను ఆశించే
విద్యార్థులకు అవ్వాలి
ఓ వరంగా మేధావుల సృష్టికి
మనుగడకు దిట్టమైన పునాదిల
- డా మైలవరం చంద్ర శేఖర్, 8187056918
- Advertisement -



