Tuesday, June 17, 2025
E-PAPER
Homeక్రైమ్ఎసీబీకి చిక్కిన విద్యాశాఖ అధికారులు

ఎసీబీకి చిక్కిన విద్యాశాఖ అధికారులు

- Advertisement -

– ములుగు డీఈఓ పాణిని, జూనియర్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ అరెస్ట్‌
నవతెలంగాణ – ములుగు

ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. ఒక ఉపాధ్యాయుడి రీపోస్టింగ్‌ కోసం డబ్బులు డిమాండ్‌ చేసినట్టు నిర్ధారణ కావడంతో డీఈఓ పాణిని, జూనియర్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాయిగూడెం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఇటీవల రోడ్డు ప్రమాదం నుంచి కోలుకొని విధుల్లో చేరేందుకు రీపోస్టింగ్‌ కోసం డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించాడు. ఈ ప్రక్రియ ముందుకు సాగించేందుకు డీఈఓ పాణిని రూ.15,000, జూనియర్‌ అసిస్టెంట్‌ దిలీప్‌ రూ.5,000 లంచం డిమాండ్‌ చేశారు. దాంతో బాధిత ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను సంప్రదించారు. సోమవారం ఇద్దరి అధికారులు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని, వారి నుంచి మొత్తం రూ.20,000 స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -