నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గురువారం బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మరణకాండకు నిరసనగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్ నాయకులు మాట్లాడుతూ.. హిందువులపై ఏ దేశంలో దాడి జరిగిన తీవ్రంగా ఖండిస్తామన్నారు బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగిన దాడిని బంగ్లాదేశ్ ప్రభుత్వం అడ్డుకొని దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ సమితి, విశ్వహిందూ పరిషత్ నాయకులు దొంతుల రమణయ్య, వూట్నూర్ రాజశేఖర్, భోగ రామస్వామి, చింత ప్రవీణ్, పోల్కం నవీన్, గుండోజి ప్రభాకర్, చింత నాగరాజు, ఆమెటి నరేందర్, రఘు, నవీన్ గౌడ్, గుండోజి రామదాసు, తీగల రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
దాడులను నిరసిస్తూ దిష్టిబొమ్మ దహనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



