- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఈహెచ్ఎస్ అమలులో ఉద్యోగ, ఉపాధ్యాయుల వాటాగా మూలవేతనంలో ఒక శాతం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని బహుజన టీచర్స్ ఫెడరేషన్ (బీటీఎఫ్) కోరింది. గురువారం హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు బీటీఎఫ్ డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కల్పదర్శి చైతన్య మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీటీఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ పట్నం చెన్నయ్య, రాష్ట్ర కార్యదర్శి మేడం విజయకుమార్ పాల్గొన్నారు.
- Advertisement -



