- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: గుంటూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధితో ఒక వృద్ధురాలు మృతి చెందారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి చెందిన పి.ధనమ్మ (61) మృతి చెందారు. నవంబరు 18న తీవ్ర జ్వరం, విరేచనాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరిన ఆమెకు వైద్యులు చికిత్స అందించారు. పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ అయినట్లు జీజీహెచ్ వర్గాలు తెలిపాయి.
- Advertisement -



