- Advertisement -
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. సిరిసిల్ల పట్టణం గీతానగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సోమవారం ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.
పరిశీలనలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, సంపత్ కుమార్, తహసీల్దార్లు మహేష్ కుమార్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



