నవతెలంగాణ – మద్నూర్
ఆల్ ఇండియా బంజారా సేవ సంఘం మద్నూర్ మండల యూత్ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు మద్నూర్ మండల బంజారా సేవా సంఘం అధ్యక్షులు శివాజీ రాథోడ్ మండల ప్రధాన కార్యదర్శి బాలాజీ రాథోడ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నూతన యూత్ కమిటీ ఎన్నికల్లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రాథోడ్ సురేందర్ జిల్లా ఉపాధ్యక్షులు బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరగగా.. ఈ ఎన్నికలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్ హాజరైనట్లు వారు తెలిపారు.
మండల యూత్ నూతన కమిటీ ఈ విధంగా ఉంది..
అధ్యక్షులుగా పవర్ రాజేష్, ఉపాధ్యక్షులుగా రాథోడ్ శ్రీనివాస్, రాథోడ్ సంజయ్, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సంతోష్, కోశాధికారిగా రాథోడ్ సునీల్, గౌరవ అధ్యక్షులుగా రాథోడ్ శ్రావణ్, సహాయ కార్యదర్శిలుగా రాథోడ్ రవి, రాథోడ్ రాందాస్, ఎన్నికయ్యారు.