42శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలు.. కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
నవతెలంగాణ -కూసుమంచి
మొదటి విడతలోనే పాలేరు నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జేడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మండలాల వారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వమూ చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీఓ జారీ చేసి ఎన్నికలకు సిద్ధమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీఓను కొందరు హైకోర్టులో సవాలు చేశారని, అక్టోబర్ 8న హైకోర్టు తీర్పు వెలువడనున్నదని తెలిపారు. ఆ తీర్పును స్వాగతిస్తూ… కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గ్రామాల్లో విభేదాలు ఉన్నా వాటిని చర్చల ద్వారా పరిష్కరించి ఐక్యతతో ముందుకు సాగాలని కార్యకర్తలకు సూచించారు. అభ్యర్థుల ఎంపికలో పారదర్శకత కోసం ప్రతి మండలానికి తొమ్మిది మంది సభ్యులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఒకే గ్రామం నుంచి అనేక మంది ఆశావహులు ఉన్నప్పుడు గెలుపు అవకాశాలు, పార్టీపై విధేయతను పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులను ఖరారు చేస్తామని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా పోటీకి దూరమైన వారికి వేరే అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
మొదటి విడతలోనే పాలేరు నియోజకవర్గంలో ఎన్నికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES