విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన
బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్
నవతెలంగాణ – ముషీరాబాద్
రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయాలని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్ ప్రమాదాలను నివారించడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద సభ నిర్వహంచారు. జేఏసీ చైర్మెన్ కె.ఈశ్వర్రావు అధ్యక్షత వహించిన ఈ సభలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కార్మికులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ మాట్లాడుతూ.. టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ట్రాన్స్కో, జెన్కో తదితర విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20వేల మంది ఆర్టిజన్ కార్మికులు సేవలందిస్తున్నారని తెలిపారు. వారందరినీ వారి విద్యార్హతలను బట్టి జూనియర్ లైన్మెన్, సబ్ ఇంజినీర్, జూనియర్ అసిస్టెంట్, సబార్డినేట్ పోస్టులకు కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు. కన్వర్షన్ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి అదనపు ఆర్థిక భారమూ పడదని తెలిపారు.
విద్యార్హతలను బట్టి పోస్టుల్లో భర్తీ చేయాలి : పాలడుగు
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సంబందిత శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి తమగోడు వినిపించినప్పటికీ పట్టించుకోకపోవడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ ఆర్టిజన్స్ను వారి విద్యార్హతలను బట్టి సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యుత్ కార్మికులతో పెట్టుకున్న గత ప్రభుత్వాల గతే కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20వేల మంది ఉద్యోగులు సమ్మెకు వెళ్తారని తెలిపారు. ఈ సభలో కన్వీనర్ ఎం.వజీర్, కో చైర్మెన్ జి.నాగరాజు, సహాయ కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, కె.లింగం, రఘునాధరెడ్డి, జేఏసీ నేతలు రాఘవేందర్రెడ్డి, కోటిగౌడ్, సలీం పాషా, కె.వెంకటేష్, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ ఆర్టిజన్స్ను కన్వర్షన్ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES