- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఝార్ఖండ్లో ఏనుగు బీభత్సం సృష్టించింది. వెస్ట్ సింగ్సూమ్ జిల్లా చాయీబాసా అటవీ డివిజన్ పరిధిలో కేవలం రెండు రోజుల్లోనే ఏనుగు దాడిలో 13 మంది మృతి చెందారు. నోవాముండి, హటగమారియా ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. గత నెల రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఏనుగు దాడుల వల్ల మృతుల సంఖ్య 20కి చేరింది. పరిస్థితిని నియంత్రించేందుకు అటవీశాఖ అధికారులు ఏనుగును అడవిలోకి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు.
- Advertisement -



