నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య తలెత్తిన విషయం తెలిసిందే. ట్రంప్ అడ్మినిస్ట్రషన్ రూపొందించిన ‘బిగ్ బ్యూటీఫుల్’ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. మస్క్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం కూడా జోరుగా జరిగింది. మస్క్పై చర్యలు తప్పవనే ధోరణిలో ట్రంప్ హెచ్చరికల వరకూ పరిస్థితి వెళ్లింది. ఇలాంటి సమయంలో ట్రంప్పై సోషల్ మీడియా పోస్టుల్లో తాను చేసిన ఆరోపణలపై మస్క్ తాజాగా పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా పోస్టులు చాలా దూరం వెళ్లాయంటూ విచారం వ్యక్తం చేసారు. ”అధ్యక్షుడు ట్రంప్పై గత వారంలో నేను పెట్టిన కొన్ని పోస్టులపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. ఇవి చాలా దూరం వెళ్లాయి” అని సామాజిక మాధ్యమం ఎక్స్లో మస్క్ పోస్ట్ చేశారు.
తన పోస్టులపై ఎలాన్ మస్క్ పశ్చాత్తాపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES