- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని గొడుగు మర్రి తాండ, గోకుల్తాండాలో శనివారం ఉపాధి హామీ పనులను స్థానిక సర్పంచులు రవి నాయక్, మోహన్ నాయకులు స్థానిక గ్రామపంచాయతీ పాలకవర్గం తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హామీ పనిని వినియోగించుకోవాలని సూచించారు. ఉపసర్పంచులు మాలావత్ శంకర్ నాయక్, మేఘావత్ మంజుల, తాండ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



