- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్టు కమాండర్ నితేష్ యాదవ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దౌనా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మరో మావోయిస్టు నాయకుడు కుందన్ ఖోర్వార్ను అరెస్టు చేశారు. జార్ఖండ్లోని లతేహార్ జిల్లాలోని జవాన్లు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుండి సోమవారం ఉదయం వరకు జరిగిన ఎన్కౌంటర్లో వారు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -