Saturday, June 28, 2025
E-PAPER
Homeఆటలుఇంగ్లాండ్‌ క్లీన్‌స్వీప్‌

ఇంగ్లాండ్‌ క్లీన్‌స్వీప్‌

- Advertisement -

మూడో వన్డేలో వెస్టిండీస్‌పై
ఏడు వికెట్ల తేడాతో గెలుపు
ఓవల్‌:
వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టు 3-0తో చేజిక్కించుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన మూడో, చివరి వన్డేలో ఇంగ్లండ్‌ జట్టు ఏడు వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 40ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ నిర్దేశించిన 246పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ జట్టు కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. జేమీ స్మిత్‌(64; 28బంతుల్లో) తొలి అర్ధసెంచరీకి తోడు డకెట్‌(58) తొలి వికెట్‌కు 93పరుగులు జతచేశారు. ఆ తర్వాత రూట్‌(44) బ్యాటింగ్‌లో రాణించగా.. కెప్టెన్‌ బ్రూక్‌(26), బట్లర్‌(41) మరో వికెట్‌ పడకుండా మ్యాచ్‌ను ముగించారు. విండీస్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 29.4ఓవర్లలో 3వికెట్లు కోల్పోయి 246పరుగులు చేసి గెలిచింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇంగ్లండ్‌ బౌలర్లు నిలువరించారు. ఆదిల్‌ రషీద్‌(3/40)కి తోడు మహమూద్‌, కర్సే, పోట్స్‌ రెండేసి వికెట్లతో కట్టడి చేశారు. వెస్టిండీస్‌ బ్యాటర్లలో మోటీ(61), రూథర్డ్‌ఫోర్డ్‌(70) అర్ధసెంచరీలతో రాణించగా.. జోసెఫ్‌(41) ఫర్వాలేదనిపించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ జేమీ స్మిత్‌కు, సిరీస్‌ జో రూట్‌కు దక్కాయి. ఇరుజట్ల మధ్య మూడు టి20ల సిరీస్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -