చిరంజీవి, వెంకటేష్ కాంబోలో రూపొందిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదలై, అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రికార్డులను బద్దలు కొట్టి, సంచలనాత్మకంగా 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లు వసూలు చేసింది. ఇండియాలో అద్భుతమైన జోరును కొనసాగిస్తూ, ఉత్తర అమెరికాలో 2 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువవుతున్న తరుణంలో మెగాస్టార్ ఇంట్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ బ్లాక్బస్టర్ విజయాన్ని పురస్కరించుకుని చిరంజీవి తన నివాసంలో ఒక గ్రాండ్ పార్టీని ఇచ్చి, ఆ సాయంత్రాన్ని సంక్రాంతి వేడుకల కొనసాగింపుగా మార్చారు. తారల సందడితో కొనసాగిన ఈ వేడుకకు రామ్ చరణ్, వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెలతో పాటు పలువురు హాజరయ్యారు.
ఈ వేడుకలు ఉత్సాహభరితమైన కేక్ కటింగ్ కార్యక్రమంతో ప్రారంభ మయ్యాయి, అనంతరం చిత్ర బృందం అద్భుతమైన విందులో పాల్గొంది. నవ్వులు, కృతజ్ఞతలు, ఆత్మీయ సంభాషణలతో వేడుక కన్నుల పండగలా సాగింది. సినిమా ఘన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ చిరంజీవి స్వయంగా కతజ్ఞతలు తెలియజేశారు.
ఈ వేడుకను విజయోత్సవంగా మాత్రమే కాకుండా సంక్రాంతి సంబరాలుగా ఆనందంగా జరుపుకున్నారు.
రూ.100 కోట్ల క్లబ్లోకి..
- Advertisement -
- Advertisement -



