- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దతూండ్ల గ్రామపంచాయతీ పరిధిలో పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్నీ గ్రామ ప్రత్యేక అధికారి, మండల ఎంపిడిఓ ఎన్.శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లుగా గ్రామపంచాయితి కార్యదర్శి పి.సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా చెట్లను నాటడం జరిగిందని తెలిపారు. అనంతరం ప్రత్యేకాధికారి జాతీయ గ్రామీణ ఉపాధిహామీ కూలీలకు పర్యావరణంపై అవగాహన కల్పించి, పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ సంతోష్,పారిశుద్ధ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -