జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్
తాడ్వాయిలో భారీ ర్యాలీ
నవతెలంగాణ – తాడ్వాయి
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, ప్రతి ఒక్కరు విరివిగా మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు, ఐకెపి సిబ్బంది తో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మేడారం రోడ్డు ఆర్చ్ గేటు వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిపిఓ దేవరాజు మాట్లాడుతూ ప్రకృతి కన్నతల్లి లాంటిది అన్నారు. దానిని కాపాడుకోవడం సామాజిక బాధ్యత అని చెప్పారు. పర్యావరణాన్ని రక్షించుకుంటేనే భావితరాలకు మనుగడ ఉంటుందని, ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమని పేర్కొన్నారు. ప్లాస్టిక్ని నిషేధించాలన్నారు. ప్లాస్టిక్ తో పర్యావరణం దెబ్బతింటుందని తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా రోడ్లకు విలువైపులా కొన్ని మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమన వాణి, ఎంపీ ఓ శ్రీధర్ రావు, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శులు ఎంపీడీవో ఆఫీస్ సిబ్బంది, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణ.. అందరి బాధ్యత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES