అటవీ శాఖ అధికారి పోలం నరేందర్
మండలంలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
మండల కేంద్రం నుండి మేడారం వరకు బైక్ ర్యాలీ
నవతెలంగాణ – తాడ్వాయి
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తాడ్వాయి వన్యప్రాణి విభాగం అటవీశాఖ అధికారి పోలం నరేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రతి దుకాణంలో, కిరాణం షాపులలో ప్లాస్టిక్ వాడకం, వాటి నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం నుండి మేడారం వరకు 20 కిలోమీటర్లు బైక్ ర్యాలీ నిర్వహించారు. తాడ్వాయి టూ మేడారం మార్గమధ్యంలో రోడ్డు కు ఇరువైపులా జాతర కు వచ్చే భక్తులు తిని పడేసిన వ్యర్థ పదార్థాలు ప్లాస్టిక్ కవర్లు, సీసాలను తొలగించారు. మేడారానికి వచ్చిన సందర్శకులకు ప్లాస్టిక్ ని నిషేధిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం అని దానిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వన్యప్రాణి విభాగం అటవీశాఖ అధికారి (ఎఫ్ఆర్ఓ) పొలం నరేందర్ మాట్లాడుతూ రోజురోజుకు కాలుష్యం పెరుగుతున్న క్రమంలో చెట్లు నాటడమే అందుకు పరిష్కారం అన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలన్నారు. మొక్కలే జీవకోటికి ప్రాణదారం అని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగం తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. అడవులు విపరీతంగా పెరిగితేనే పర్యావరణం రక్షించబడి వర్షాలు బాగా కురుస్తాయి అన్నారు. వాతావరణం లోని ఓజోన్ పొర దెబ్బతినకుండా జీవకోటి రక్షణకు ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కృష్ణవేణి, సెక్షన్ ఆఫీసర్లు లింగా నాయక్, స్వరూప, బీట్ ఆఫీసర్లు, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాగా మండలంలోని టెరిటోరియల్ విభాగానికి చెందిన ఎఫ్ఆర్ఓ కోట సత్తయ్య ఆధ్వర్యంలో కూడా ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES