- Advertisement -
ముంబయి : ఏరోస్పేస్, కన్జూ మర్ రంగాలకు ప్రెసిషన్ మాన్యు ఫ్యాక్చరింగ్ సేవలు అందించే ఈక్వస్ లిమిటెడ్ తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు సంబంధించి కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసా యిదా పత్రాలను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ ద్వారా 200 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1700 కోట్లు) సమీకరించే యోచనలో ఉందని తెలుస్తోంది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలో (ఓఎఫ్ఎస్) షేర్లను విక్రయించనుంది. ఈ ఇష్యూకు కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
- Advertisement -