- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని హాస కొత్తూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శుక్రవారం వ్యాస రచన పోటీలను నిర్వహించారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి పోలీస్ ఆధ్వర్యంలో ఈ వ్యాస రచన పోటీలను నిర్వహించారు. విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో వ్యాస రచన పోటీలను నిర్వహించారు.అనంతరం వ్యాచరచన పోటీలో అత్యుత్తమ ప్రతిభ చూపిన ఇద్దరు విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



