- Advertisement -
నవతెలంగాణ-రామగిరి
రాష్ట్ర ఐటి మంత్రి మ్యానిఫెస్టో చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ బాబును కలిసి ఉద్యమకారుల ఆకాంక్ష సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయమని అభ్యర్థించినట్లు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉత్తర తెలంగాణ కన్వీనర్ బత్తుల శంకర్ తెలిపారు. ఐటి శాఖ మంత్రి సానుకూలంగా స్పందించినట్లు శంకర్ తెలిపారు. ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్న, కాస్త సమయం పట్టినప్పటికీ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి హామీ ఇచ్చారనీ, కాస్త ఓపిక పట్టాలని మంత్రి సూచించారని తెలిపారు.
- Advertisement -