- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
వేసవిలో అడవులకు నిప్పు అంటుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎఫ్డీఓ రామ్మోహన్ తెలిపారు. జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని చింతగూడ, పైడిపల్లి అటవీ ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా రాలిన టేకు ఆకులను తొలగించి ఫైర్ ట్రాకులను శనివారం ఎఫ్ఎస్ఓ బొజ్జ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అటవీ మార్గాల్లో ప్రయాణించే వారు బీడీలు, సిగరెట్లు తాగి పడేయడం వల్ల మంటలు వ్యాపించే ప్రమాదం ఉందని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.
- Advertisement -



