- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కవిత విజ్ఞప్తి మేరకే ఆమె రాజీనామాను ఆమోదించినట్లు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెలిపారు. భావోద్వేగంతో రాజీనామా చేసినప్పుడు కొంతకాలం వేచిచూస్తామని, ఆమె విషయంలోనూ అదే జరిగిందని ఆయన హైదరాబాద్లో మీడియాతో పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త పార్టీలు పెట్టాల్సిన అవసరం లేదని, కొత్త పార్టీ వచ్చినా మనుగడ కష్టమని, గతంలో వచ్చిన పలు రాజకీయ పార్టీలు కనుమరుగయ్యాయని గుత్తా అభిప్రాయపడ్డారు.
- Advertisement -



