నవతెలంగాణ-హైదరాబాద్: భార్యను హత్య చేసిన బ్లాక్ క్యాట్ కమండోకు ఉపశమనం కల్పించేందుకు సుప్రీంకోర్టు మంగళవారం నిరాకరించింది. పాక్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్లో తాను భాగమని కమాండో కోర్టుకు తెలిపారు. ‘అయినప్పటికీ మీకు మినహాయింపు ఇవ్వలేము’ అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలోని ఉన్నత ఉగ్రవాద నిరోధక దళమైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సభ్యులను బ్లాక్ క్యాట్ కమాండోగా వ్యవహరిస్తారు.
పోలీసుల ఎదుట లొంగిపోకుడా మినహాయింపు కోరుతూ కమాండో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై నేడు ధర్మాసనం విచారణ చేపట్టింది. తాను ఆపరేషన్ సిందూర్లో భాగస్వామినని, బ్లాక్ క్యాట్ కమాండోనని పేర్కొన్నారు. అది మీకు రక్షణ కల్పించదని, మీరు బ్లాక్ క్యాట్ కమాండో అయితే ఇంటిలో పాల్పడిన దారుణాల నుండి మినహాయింపు ఇవ్వలేమని జస్టిస్ ఉజ్వల్ భుయాన్ పేర్కొన్నారు. కమాండో తన భార్యను గొంతు కోసి హత్య చేసిన భయంకరమైన ప్రవర్తనను గుర్తించామని జస్టిస్ ఉజ్వల్ భుయాన్ పేర్కొన్నారు. కమాండోకు ఉపశమనం కల్పించేందుకు హైకోర్టు కూడా నిరాకరించిందని జస్టిస్ వినోద్ చంద్రన్ పేర్కొన్నారు.
కమాండోపై ఐపిసి సెక్షన్ 304బి కింద కమాండోపై అభియోగం నమోదైంది. అతను కట్నం కింద మోటార్ సైకిల్ డిమాండ్ చేశాడని కమాండో తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అతని భార్య తరపు బంధువులు ఈ ఆరోపణలు చేశారని అన్నారు.
సుప్రీంకోర్టు అతనికి ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. స్పెషల్ లీవ్ పిటిషన్పై ప్రాసిక్యూషన్ నుండి ప్రతిస్పందన కోరుతూ నోటీసు జారీ చేసింది. కమాండో రెండు వారాల్లోగా కోర్టు ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.