- Advertisement -
నవతెలంగాణ – భీంగల్
భీంగల్ మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులకు ఈరోజు నుండి ఐదు రోజులపాటు ఉదయం 9:30 గంటలకు శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని విద్యాశాఖ అధికారి డి,స్వామి తెలిపారు.ప్రతి ఉపాధ్యాయుడు కనీస సామర్ధ్యాలు పెంచల కృషి చేయాలని అన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కలిసి పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ పెంచుటకు కృషి చేయాలని సూచించారు. గ్రామాలలో బడిబాట కార్యక్రమాలు జరిపి, విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్, కాశి రవి, ఈ,శేఖర్, ఎమ్, ప్రభాకర్, శ్రీనివాస్, రవీందర్, సౌజన్య, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -