- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదగాలని మండల తహశీల్దార్ రవికుమార్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవంలో భాగంగా మండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాలలో పాఠశాల స్పెషల్ ఆపిసర్ భవాని ఆధ్వర్యంలో విద్యార్థినిలకు సైన్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా తహసీల్దార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సైన్స్ లాబ్,విద్యార్దినిలకు మెనూ ప్రకారం బోజనం అందిస్తున్నారా..లేదని తనిఖీ నిర్వహించారు. పాఠశాల తరగతి గదులు,ఆవరణలో పరిశుభ్రంగా ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థునిలు పాల్గొన్నారు.
- Advertisement -



