Friday, June 20, 2025
E-PAPER
Homeజిల్లాలుప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి: ఎమ్మెల్యే

ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని తల్లిదండ్రుల ఆశయాలను సాధించడానికి నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తెలిపారు. శుక్రవారం భిక్కనూర్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలలో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాలలకు అందజేసిన కంప్యూటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యేకు పాఠశాలలో నూతన తరగతి గదులు, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, ఫర్నిచర్, సీసీ కెమెరాలను ఇతర సమస్యలు పరిష్కరించాలని ఉపాధ్యాయులు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు. అంతకుముందు ఎన్.సి.సి విద్యార్థులు ఎమ్మెల్యేను ఘన స్వాగతం పలికారు. మొదటిసారి పాఠశాలకు వచ్చిన ఎమ్మెల్యేను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాలువాతో సన్మానించారు. విద్యార్థులు చేసిన పరిశోధనలు చూసి ఎమ్మెల్యే సంతోషించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ అందజేసిన బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ప్రతినిధులకు ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఎంఈఓ రాజా గంగారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనాథ్, బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం, ఏఏపీసీ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -