-డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ
– హుస్నాబాద్ ఏసిపి సాదారపు సదానందం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ : గ్రామీణ ప్రాంతాలలో యువతీ యువకులు, విద్యార్థులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ పై అవగాహన కలిగి వుండాలని హుస్నాబాద్ ఏసిపి సాదారపు సదానందం అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలోనీ ఏసిపి కార్యాలయంలో డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డ్రగ్స్ రహిత నియోజకవర్గంగా కృషి చేయాలని కోరారు ఏప్రిల్ 21న మాణిక్యపుర్ గ్రామంలో మొదలైన ఈ డ్రగ్స్ నిర్మూలన పోరు యాత్ర కార్యక్రమం భీమదేవరపల్లి, సైదాపూర్ ,చిగురుమామిడి ,కోహెడ, అక్కన్నపేట, మరియు ఎల్కతుర్తి మండలాలను పూర్తిచేసుకుని నేడు హుస్నాబాద్ మండలానికి వచ్చిందన్నారు. డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలు, లోకజ్ఞానం లేనటువంటి విద్యార్థులకు నూతన జీవితాన్ని అందించాలని ముఖ్య ఉద్దేశం అన్నారు.
తల్లిదండ్రులకు డ్రగ్స్ పై అవగాహన తప్పకుండా కలగాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సిఐ శ్రీనివాస్, ఎస్ ఐ లు మహేష్, విజయ్ భాస్కర్, సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి, జేఏసీ కన్వీనర్ కవ్వా లక్ష్మారెడ్డి, మాజీ కౌన్సిలర్ గాదపాక రవీందర్, హుస్నాబాద్ నియోజకవర్గ జేఏసీ కోఆర్డినేటర్ మేకల వీరన్న యాదవ్ డ్యాగల సారయ్య , ఏ పి ఎం అంబాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.