Thursday, June 5, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి...

ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి…

- Advertisement -

జిల్లా వైద్యాధికారి రజిత 
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
: ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత అన్నారు. టిబి ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని ఇందిరానగర్ లో భారత్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ…60 సంవత్సరాలు పైబడిన వారు, ఇదివరకు టీబీ మందులను వాడిన వారు, వాళ్ళ కుటుంబ సభ్యులు డయాబెటిక్, బీడీలు, పొగ తాగే వాళ్ళు, బిఎంఐ 18 కన్నా తక్కువ ఉన్నవాళ్లు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని, అనుమానితులను గుర్తించి టీబీ,తెమడ పరీక్షలు నిర్వహించారు. టీబీ వ్యాధి వచ్చిన వారికి ఉచితంగా మందులు, ఆరు నెలల వరకు పోషణ భత్యం, పోషకాహారం తీసుకోవడానికి వెయ్యి రూపాయలు పారితోషకాన్ని అందిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ అనిత టిబి ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ అంజలి ఆల్ఫ్రెడ్, డాక్టర్ సంపత్, డాక్టర్ రామకృష్ణ, స్రవంతి రెడ్డి, డిప్యూటీ డెమో రాజ్ కుమార్, లింగం, బిగిందర్, జేత్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -