నవతెలంగాణ – కుభీర్
మండలం లోని 42గ్రామ పంచాయతీలో మూడో విడత స్థానిక సర్పంచ్ వార్డ్ సభ్యుల ఎన్నికలకు సర్వం సిద్దమైనట్లు ఎంపీడీఓ సాగర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. మండలంలో 42 గ్రామపంచాయతీలు ఉండగా అందులో ఇందులో ముడు పల్సి తండా, జంగావ్, బ్రమేశ్వర్ గ్రామ పంచాయతి లు ఏకగ్రీవం కాగా మిగితా 39గ్రామ పంచాయతిలో సర్పంచ్ 231 వార్డ్ సభ్యుల కు బుధువారం స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. దింతో మంగళవారం మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన ఎన్నికల సామాగ్రి నీ అధికారులకు పంపిణి చేశారు. దింతో అధికారులకు ఎన్నికలు నిర్వహణ పక్క ప్రణాళికలతో జరపాలని అధికారులు ఎంపీడీఓ ఆదేశించారు. ఎలాంటి లోటు బాటులకు చోటు కల్పించకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నమని అన్నారు.
మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



