మూడు కేంద్రాల్లో 45 మంది పరీక్షలకు గైర్హాజరు
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు – 2026 సోమవారం నాటికి ఐదో రోజు కు చేరాయి.పరీక్షా కేంద్రాలు వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఐ నాగరాజు, ఎస్సై అఖిల లు కేంద్రాల వద్ద ఇద్దరేసి చొప్పున పోలీస్ సిబ్బంది ని నిఘా పెట్టారు.
మూడు కేంద్రాల్లో ఐదో రోజు 920 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 875 మంది పరీక్షలకు హాజరు అయ్యారు.45 మంది పరీక్షలకు హాజరు కాలేదు. మూడు కేంద్రాల డిపార్ట్మెంట్ ఆఫీసర్,సీఎస్ లు కోళ్ళ శ్రీనివాస్,సత్య శ్రీధర్,ఝాన్సీ,సంగీత,రాంబాబు,ఎల్ ఎస్ ప్రసాద్ లు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి.
కేంద్రం అలాట్మెంట్ హాజరు గైర్హాజరు
జీజేసీ 407 389 18
టీజీఎంఆర్ జేసీ 176 172 04
వీకేడీవీఎస్ఆర్ జేసీ 337 314 23
మొత్తం 920 875 45



