Tuesday, June 24, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఆరుగ్యారంటీలపై కాలయాపన

ఆరుగ్యారంటీలపై కాలయాపన

- Advertisement -

– స్థానికంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే : బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

క్యాబినెట్‌లో ప్రజా సమస్యలపై చర్చించకుండా మంత్రులు కబుర్లు చెప్పుకుంటున్నారనీ, ఆరు గ్యారెంటీల అమలుపై కాలయాపన చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం హైదరా బాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు ఏమైంది? ఆరు గ్యారెంటీల గురించి క్యాబినెట్‌ సమావే శంలో ఎందుకు చర్చించడం లేదు? వాటిని అమలు చేసే ప్రణాళిక ను ఎందుకు సిద్ధం చేయలేకపోతు న్నారు? అని ప్రశ్నించారు. పింఛన్ల పెంపు ప్రస్తావన ఏదీ అని నిలదీశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 11 నెలలుగా మున్సిపాలిటీలు, 15 నెల లుగా పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు జరగకపోవడం తో పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రైతు భరోసా పథకం ఈ సీజన్‌కి చివరిదైపోతోం దన్న అనుమానం ప్రజల్లో గట్టిగా వినిపిస్తోంద న్నారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి కేసును సీబీఐతో విచారణ జరిపించాలి అని అడిగారనీ, ఇప్పుడెం దుకు విచారణ చేయించడం లేదని నిలదీశారు. ఈ విచారణల ఆలస్యం వెనుక రాహుల్‌ గాంధీతో కేసీఆర్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉందా?ఎవరు అడ్డుపడుతున్నారు? అని ప్రశ్నించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కేసు, మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ కొనుగోళ్ల అంశం.. ఇవన్నిం టిలో ఏ ఒక్కటి అయినా విచారణ జరిపించిందా? అని నిలదీశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు ఇప్పించాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -