Sunday, June 22, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రాణం తీసిన వివాహేతర సంబంధం

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

- Advertisement -

– కండ్లల్లో కారం చల్లి.. మర్మంగాలపై కొట్టి.. పిడిగుద్దులు
– అపస్మారక స్థితిలో యువకుడు
– చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి
నవతెలంగాణ- నకిరేకల్‌

వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. యువకుడి కండ్లల్లో కారం చల్లి.. చెట్టుకు కట్టేసి.. మర్మాంగాలపై రక్తం వచ్చేలా కొట్టి.. చాతిపై పిడిగుద్దులు గుద్ది.. కాళ్లు విరగ్గొట్టిన విషాదకర ఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలంలోని నోముల గ్రామంలో శుక్రవారం జరిగింది. బంధువులు, గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సింగ్‌ జానయ్య(34) వృత్తిరీత్యా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తూ తన తల్లితో కలిసి గ్రామంలో నివాసముంటున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో ఎనిమిదేండ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు గొడవలు జరిగి పోలీస్‌ స్టేషన్‌ వరకు పంచాయితీ వెళ్లగా పెద్దల సమక్షంలో మాట్లాడి పంపించారు.
ఇదే విషయంపై గతేడాది సదరు మహిళ భర్త నాగరాజు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జానయ్య అరెస్టై జైలుకు సైతం వెళ్లాడు. ఇటీవల బెయిల్‌పై బయటకొచ్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నాగరాజు లేని సమయంలో జానయ్య ఆ మహిళ ఇంటికి వెళ్లగా ఆమెతో వాగ్వివాదం జరిగింది. దీంతో ఆమె కూతురు నాగరాజుకు ఫోన్‌ చేయడంతో ఆవేశంతో ఇంటికి వచ్చిన ఆయన అక్కడే ఉన్న జానయ్యను చితకబాదాడు. మర్మాంగాలపై, చాతిపై పిడిగుద్దులు గుద్ది ఇంటి ముందు చెట్టుకు కట్టేశాడు. మర్మాంగాలపై కొట్టి రక్తం కారుతూ స్పృహ కోల్పోయే వరకు చితక్కొట్టాడు. కండ్లల్లో కారం కొట్టి శరీర భాగాలను చెక్కిన ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ఘటన గ్రామంలో భయాందోళనకు గురిచేసింది. గ్రామస్తులు ఎవరూ దగ్గరకు వెళ్లలేని పరిస్థితి. ఈ విషయాన్ని యువకుని బంధువులకు చెప్పడంతో వారు వచ్చి చెట్టు కట్టేసి ఉన్న జానయ్యను విడిపించారు. అంబులెన్సులో నకిరేకల్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి జానయ్య మృతి చెందాడు. మృతుడి తల్లి నర్సింగ్‌ ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు నకిరేకల్‌ సీఐ రాజశేఖర్‌ తెలిపారు. మృతదేహాన్ని శనివారం గ్రామానికి తరలించారు. కాగా నిందితులు ధనమ్మ, నాగరాజు నల్లగొండ డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయినట్టు సమాచారం. అన్ని కోణాల్లోనూ విచారణ చేసి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని సీఐ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -