నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన సిరి పిల్లల హాస్పిటల్, తపస్ అధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ చిలుక చైతన్య సుమారు 80 మందికి పైగా పిల్లలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిలుక చైతన్య మాట్లాడుతూ నావజాత శిశువు నుండి 14 సంవత్సరాల వయసు వరకు శారీరకంగా, మానసిక, ఆరోగ్య కరమైన పెరుగుదల ముఖ్యం అన్నారు. ప్రస్తుతం వర్షాకాలంలో సీజనల్, వైరల్ వ్యాధుల ముప్పు పొంచి ఉందని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్వంత గ్రామంలో ఉచితంగా వైద్య సేవలు అందించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్న డాక్టర్ చిలుక చైతన్యకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం అధ్వర్యంలో సన్మానం చేసి కృతజ్ఙతలు తెలిపారు. కార్యక్రమంలో కమ్మర్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, గ్రామ కమిటీ అధ్యక్షులు భోగ రామస్వామి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మండల అధ్యక్షులు సల్లూరి కిషన్ గౌడ్, కార్యదర్శి రమేష్, శంకర్, రామకృష్ణ రెడ్డి, కిషన్ రెడ్డి, రుద్ర మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES