Tuesday, September 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్షరాస్యత వైపు అతివలు.!

అక్షరాస్యత వైపు అతివలు.!

- Advertisement -

‘ఉల్లాస్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం..
నవతెలంగాణ – మల్హర్ రావు

అక్షరాలు నేర్వని అతివలకు కనీసం చదవడం, రాయడం, అంకెలు గుర్తించడం, లెక్కలు నేర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈమేరకు  మండల పరిధిలోని మహిళా సంఘాల్లో ఉన్న నిరక్ష్యరాసులను గుర్తించి ఉల్లాస్ యాప్ లో నమోదు చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులు విద్యావంతులైతే సంఘాలు మరింత పటిష్టంగా కొనసాగి,నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

పరిధిలోని 27 గ్రామైఖ్య సంఘాలు ఉండగా, 684 స్వశక్తి సంఘాల్లో మొత్తం 7040 మంది సభ్యులున్నారు. వీరిలో సుమారు 50 శాతం మేర నిరక్ష్యరాసులన్నారని సమాచారం. వీరిలో అక్షరజ్ఞానం లేని 3,520 మందిని మొదటి విడతలో గుర్తించిన అధికారులు, ఉల్లాస్ యాప్ నమోదు చేశారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పడానికి గాను ప్రతి 10 మందికి ఒకరి చొప్పున 300 మందికి పైగా వలంటీర్లను నియమించారు. ఈమేరకు గ్రామాల పరిధిలో ఎంపిక చేసిన సభ్యులకు అక్షర వికాసం అనే పుస్తకాలను అందజేశారు.త్వరలో 100 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, వచ్చే మార్చిలో పరీక్షలు నిర్వహించనున్నారు. మహిళా సంఘాల సభ్యులకు చదవడం, రాయడం, సంఖ్య,పరిజ్ఞానం నేర్పనున్నారు. జిల్లా విద్యాశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త భాగస్వామ్యంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్

మహిళా సంఘాల్లో మండల పరిధిలో కనీస పరిజ్ఞానం ఉండి పది, ఇంటర్ పూర్తి చేయనివారిని ఎంపిక చేశారు. వీరు పదో తరగతి చదవడానికి గాను రూ. 1,150, ఇంటర్ కోసం రూ.1,500 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వీరికి ఓపెన్ స్కూల్లో చదువు చెప్పనున్నారు. ఇందుకోసం స్కూళ్లను ఎంపిక చేశారు.మండలంలో కనీసం రెండు వందల మందిని పది, ఇంటర్ పూర్తి చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సంబంధిత అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -