- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం కంటి పరీక్షా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో కంటి చూపు లోపాలు గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే వైద్య అధికారి డాక్టర్ సాధన, దోమకొండ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రవీందర్ పటేల్, పాఠశాల ఉపాధ్యాయులు, పీహెచ్సీ వైద్య సిబ్బంది, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



