- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పైరసీ వెబ్సైట్ ‘ఐబొమ్మ’ నిర్వాహకుడు ఇమంది రవి బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు కొట్టివేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని రవి కోర్టును ఆశ్రయించాడు. కేసు దర్యాప్తు దశలో ఉందని, అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశం ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ అనంతరం న్యాయస్థానం రవి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
- Advertisement -



