Tuesday, June 17, 2025
E-PAPER
Homeతాజా వార్తలునకిలి విత్తనాల ముఠా పట్టివేత..

నకిలి విత్తనాల ముఠా పట్టివేత..

- Advertisement -

బెజ్జంకిలో పట్టుబడిన ముగ్గురు నకిలీ విత్తనాల ముఠా సభ్యులు
సుమారు 160 కిలోల నకిలీ పత్తి విత్తనాల స్వాధీనం
కేసు నమోదు..రిమాండుకు తరలింపు
వివరాలు వెల్లడించిన సిద్దిపేట టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్ 
నవతెలంగాణ – బెజ్జంకి/ సిద్దిపేట రూరల్
: నకిలీ విత్తనాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు తమదైన శైలిలో చాకచక్యంగా వ్యవహరించి ఉక్కుపాదం మోపారు. ఆదివారం సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి మండల కేంద్రంలో రైతు ఎండ్ల బండి చౌరస్తా వద్ద టాస్క్ ఫోర్స్,వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు దాడి చేసి నకిలీ విత్తనాల ముఠాను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషనుకు తరలించి ప్రాథమిక విచారణ చేపట్టారు.సోమవారం సిద్దిపేట రూరల్ సీఐ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ రవీందర్ నిందితుల వివరాలు వెల్లడించారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం సర్వాయిపేట గ్రామానికి చెందిన దుర్గం శేఖర్(30),ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా మైదకూర్ కు చెందిన ఇనుకొల్లు వసంత రాంరెడ్డి(50),నంద్యాల,కొండపల్లి గ్రామానికి చెందిన కుందవరం ప్రభాకర్(50) నకిలీ విత్తనాల ముఠాపై టాస్క్ ఫోర్స్ సీఐ జానకి రాంరెడ్డి,రూరల్ సీఐ శ్రీను,బెజ్జంకి ఎస్ఐ బద్దిపడగ తిరుపతి రెడ్డి,ఏఓ సంతోష్ దాడి చేసి సుమారు 4 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.స్థానిక పోలీస్ స్టషన్ యందు చేపట్టిన ప్రాథమిక విచారణలో మరిన్ని పత్తి విత్తనాలను గ్రామ శివారులోని పట్టుపురుగుల కేంద్రం వద్ద నిల్వ చేశామని నిందితులు వెల్లడించడగా సుమారు 160 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకుని అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.ముగ్గురు నిందితులపై బెజ్జంకి ఎస్ఐ కేసు నమోదు చేయగా రిమాండుకు తరలించామని వెల్లడించారు.టాస్క్ ఫోర్స్,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -