నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ పోలీస్ శాఖలో జూన్ 30 న పదవి విరమణ లో భాగంగా 34 సంవత్సరాలు సర్వీస్ చేసిన హెడ్ కానిస్టేబుల్ కే.పోచయ్య సోమవారం చేశారు. ఈ సందర్భంగా పదవి వేడుకలు కార్యక్రమం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించి శాలువాతో సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు జ్ఞాపకతో సత్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని వత్తిడితో విధులు నిర్వహించి ఎలాంటి రిమార్కు లేకుండా పదవి విరమణ చేయడం ఎంతో గోప్ప విషయమని ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, మీరు డిపార్టుమెంటు కు చేసిన సేవలు ఎంతో ఘననీయమని పదవి విరమణ అనంతరము మీకు ఎలాంటి అవసరం వచ్చిన మీకు ఎల్లవేళల సహయపడుతామని, మీరు మీ కుటుంబ సభ్యులు అయురారోగ్యాలతో ఉండాలని, మీ పిల్లల భవిష్యత్తుభాగుండాలని ఆకాంక్షించారు.ఈ వీడ్కోళ్ల సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ ( అడ్మిన్ ) బస్వారెడ్డి , నిజామాబాదు సౌత్ రూరల్ సిఐ సురేష్ కుమార్, ముగ్పాల్ ఎస్ ఐ. యాదగిరి గౌడ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ తిరుపతి ( వెల్ఫేర్ ). శ్రీనివాస్ ( అడ్మిన్ ) , వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఉద్యోగ విరమణ చేసిన సిబ్బందికి వీడ్కోళు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES